నాలాయిర దివ్య ప్రబంధం

నాలాయిర దివ్య ప్రబంధం 8 వ శతాబ్దానికి ముందు, పండ్రెండు మంది ఆళ్వారులు రచించిన 4000 పాశురాల సమాహారం. తమిళంలో నాలాయిర మనగా నాలుగువేలు. 9 వ శతాబ్దంలో నాథముని వీటిని క్రోడీకరించాడు. నారాయణుని, అతని అనంత రూపాలను కీర్తించే ఈ దివ్య ప్రబంధాన్ని ఆళ్వారులు పెక్కు దేవాలయాల్లో గానం చేశారు. అలా గానం చేయబడిన ప్రాంతాలను దివ్య దేశములు అని అంటారు. దక్షిణభారతంలో ముఖ్యంగా తమిళనాడులో దివ్య ప్రబంధాన్నివేదాలతో సమంగా పరిగణిస్తారు. అందుకే దీనిని ద్రావిడ వేదం అని అన్నారు. శ్రీరంగం మొదలైన ఎన్నో దేవాలయాలలో ప్రతినిత్యం విధిగా ఈ దివ్య ప్రబంధాన్నిఉచ్చరించడం భగవత్సేవలో ఒక ముఖ్యమైన భాగం. 4000 పాశురాల్లో 1100 పైచిలుకు పాశురాలు తిరుక్కురుగూరుకు చెందిన నమ్మాళ్వారు రచించాడు. వీటినే తిరువాయ్‌మొళి అని కూడా పిలుస్తారు. తిరువాయ్‌మొళి అనగా, పవిత్రమైన నోటి నుండి వెలువడే మాటలు అని అర్థం. ఇందులో నమ్మాళ్వారు తనను తాను, కృష్ణుని ప్రేమకై తపించే ఒక గోపికగా అభివర్ణించుకుంటాడు.

నమ్మాళ్వార్, 12మందిఆళ్వారులలో ముఖ్యైనవాడు. అతను ప్రబంధాన్ని రాసాడు.

సంకలన నేపథ్యం

మార్చు

ఎక్కడో పోయినవనుకున్న దివ్య ప్రబంధ పాశురాలను నాథముని సేకరించి, సంకలన పరిచాడు. నాథముని ఇప్పటి కాట్టు మన్నార్ కోయిల్ అయిన వీరనారాయణ పురంలో జన్మించాడు. ఆళ్వారులలో చివరి వాడైన తిరుమంగై ఆళ్వారుకు నాథమునికి మధ్య ఎంతో కాలవ్యత్యాసం ఉంది. ఈ మధ్య కాలంలో ఆ 4000 పాశురాలేమైనవో ఎవరికీ తెలియదు.

ఒకసారి నాథముని కుంభకోణంలో నమ్మాళ్వారు యొక్క ఆరావముదెను ప్రజలు గానం చేస్తుండగా విన్నాడు. అందులోని ఒక పాశురంలో ఆయిరత్తుల్ ఇప్పత్తుల్ ( తమిళం : వేయిలో ఈ పది ) అని ఉంది. అయితే మిగతా 990 పాశురాలు ఏమైనట్టు ? నాథముని ప్రజలను విచారించి నమ్మాళ్వార్ స్వస్థలమైన తిరుక్కురుగూరుకు వెళ్ళాడు. అక్కడి ప్రజలు, నమ్మాళ్వారు శిష్యుడైన మధురకవి ఆళ్వారు రచించిన 11 పాశురాల గురించి చెప్పారు. అలాగే వారు నాథమునిని, నమ్మాళ్వారు స్వస్థలానికి వెళ్ళి ఈ 11 పాశురాలను 12000 సార్లు ఉచ్చరించమని సలహా ఇస్తారు. నాథముని అలాగే చేస్తాడు. అప్పుడు నమ్మాళ్వారు సంతోషించి, తన 1000 పాశురాలనే కాక, మిగతా ఆళ్వారులు రచించిన పాశురాలతో సహా, మొత్తం 4000 పాశురాలను ప్రసాదిస్తాడు.

పాశురాల సంఖ్య

మార్చు

వివిధ ఆళ్వారుల పాశురాల సంఖ్య క్రింది జాబితాలో ఇవ్వబడింది.[1] పదకొండు మంది ఆళ్వారులు తమ పాశురాలలో శ్రీమన్నారాయణుని దివ్యావతారములను కీర్తించారు. కాని మధురకవి ఆళ్వారు మాత్రం తన గురువైన నమ్మాళ్వారునే స్తుతించాడు.

క్ర.సం.ప్రబంధం పేరు ---మొదటి పాశురం సంఖ్యచివరి పాశురం సంఖ్యమొత్తం పాశురాలుగానం చేసిన ఆళ్వారు
1పెరియాళ్వార్ తిరుమొళి1473473పెరియాళ్వార్/ విష్ణుచిత్తుడు
2తిరుప్పావై47450330ఆండాళ్
3నాచియార్ తిరుమొళి504646143ఆండాళ్
4పెరుమాళ్ తిరుమొళి647751105కులశేఖరాళ్వార్
5తిరుచ్చంద విరుత్తమ్752871120తిరుమళిశై ఆళ్వార్
6తిరుమాలై87291645తొండరడిప్పొడియాళ్వార్
7తిరుప్పళ్ళియెడుచ్చి91792610తొండరడిప్పొడియాళ్వార్
8అమలనాది పిరాన్92793610తిరుప్పానాళ్వార్
9కణ్ణినున్ శిరుత్తాంబు93794711మధురకవి ఆళ్వార్
10పెరియ తిరుమొళి94820311084తిరుమంగై ఆళ్వార్
11కురుంతాండగం2032205120తిరుమంగై ఆళ్వార్
12నెడుంతాండగం2052208130తిరుమంగై ఆళ్వార్
13ముదల్ తిరువందాది20822181100పొయ్‌గై ఆళ్వార్
14ఇరండాం తిరువందాది21822281100భూదత్తాళ్వార్
15మూండ్రాం తిరువందాడి22822381100పేయాళ్వార్
16నాన్ముగన్ తిరువంతాడి2382247796తిరుమళిశై ఆళ్వార్
17తిరువిరుత్తం24782577100నమ్మాళ్వార్
18తిరువాశిరియం257825847నమ్మాళ్వార్
19పెరియ తిరువందాది2585267187నమ్మాళ్వార్
20తిరువెళుక్కుర్రిరుక్కై267226721తిరుమంగై ఆళ్వార్
21సిరియ తిరుమడల్2673271240తిరుమంగై ఆళ్వార్
22పెరియ తిరుమడల్2713279078తిరుమంగై ఆళ్వార్
23తిరువాయ్మొళి279138921102నమ్మాళ్వార్
24రామానుజ నూరందాది38934000108తిరువరంగతముదనార్
మొత్తం పాశురాలు4000

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Table showing details of 4000 pasurams". srivaishnavam.com srivaishnavam.com.

బయటి లింకులు

మార్చు


🔥 Top keywords: వంగ‌ల‌పూడి అనితమొదటి పేజీఈదుల్ అజ్ హావాతావరణంప్రత్యేక:అన్వేషణపోలవరం ప్రాజెక్టునల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపవన్ కళ్యాణ్నారా చంద్రబాబునాయుడుగాయత్రీ మంత్రంఈనాడుతెలుగు అక్షరాలుతెలుగుచింతకాయల అయ్యన్న పాత్రుడువై.ఎస్. జగన్మోహన్ రెడ్డిపవిత్ర గౌడతెలుగుదేశం పార్టీ2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుగుణింతంబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిచందనా దీప్తి (ఐపీఎస్‌)యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీఆంధ్రప్రదేశ్నక్షత్రం (జ్యోతిషం)వై. శ్రీలక్ష్మివికీపీడియా:Contact usభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితామహాభారతంశ్రీ గౌరి ప్రియరామాయణంమహాత్మా గాంధీరామ్ చ​రణ్ తేజప్రకృతి - వికృతిఅంగుళంకింజరాపు అచ్చెన్నాయుడుద్వాదశ జ్యోతిర్లింగాలుఝాన్సీ లక్ష్మీబాయితెలంగాణ